: అసెంబ్లీకి వచ్చుంటే భూమా చేత చంద్రబాబు చేయించిన తప్పులు చెప్పాల్సి వచ్చేది... ఇష్టం లేకనే రాలేదు: వైఎస్ జగన్
తమ పార్టీ నేడు అసెంబ్లీకి హాజరై ఉంటే భూమా నాగిరెడ్డితో చంద్రబాబు చేయించిన తప్పుల గురించి మాట్లాడాల్సి వచ్చేదని, భూమా మరణించిన తరువాత ఆయన తప్పులు చెప్పడం ఇష్టం లేకనే తాము సభను బహిష్కరించాల్సి వచ్చిందని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, భూమా మరణం తనను ఎంతో బాధించిందని, అది మాటల్లో చెప్పలేనిదని అన్నారు.
ఆయన కుటుంబమంటే తనకెంతో గౌరవమని, దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని అన్నారు. భూమాపై ఉన్న గౌరవంతోనే నేటి సభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. భూమాకు నివాళులు అర్పిస్తున్న సమయంలోనూ, ప్రతి ఒక్కరూ వైకాపాను ప్రస్తావిస్తూనే ఉన్నారని, ఆయనపై ప్రేమ కన్నా, తమను ఆడిపోసుకోవాలన్న ఉద్దేశమే వారిలో ఎక్కువగా కనిపించిందని ఎద్దేవా చేశారు.