: ‘రోగ్’ ఆడియో లాంచ్.. సన్నీలియోన్ లైవ్ పర్ఫార్మెన్స్ అదిరింది!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘రోగ్’ చిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం కొంచెం సేపటి క్రితం హైదరాబాద్ లో ప్రారంభమైంది. కొత్త హీరో ఇషాన్ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన మన్నారా చోప్రా, ఏంజెలినా నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో ఇషాన్, నటుడు సుబ్బరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ స్టేజ్ పై ప్రదర్శన అదరగొట్టింది. తన డ్యాన్స్ ట్రూప్ తో అదరగొట్టే స్టెప్పులేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉత్సాహపరుస్తూ తన ప్రదర్శన కొనసాగించింది.