: మలయాళ సినీ దర్శకుడు దిఫన్ చేతన్ కన్నుమూత

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మలయాళ సినీ దర్శకుడు దిఫన్ చేతన్ (47) ఈ రోజు కన్నుమూశారు. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. చేతన్ స్వస్థలం తిరువనంతపురంలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, చేతన్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. నటుడు పృథ్వీరాజ్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా విచారం వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు మంచి చిత్రాల్లో తనకు నటించే అవకాశం అభించిందన్నారు.

ఇదిలా ఉండగా, అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన దిఫన్ చేతన్, 2003లో ‘లీడర్ కింగ్ మేకర్’ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఏడు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 2009 లో నటుడు పృథ్వీరాజ్ తో ‘పుతియా ముఖం’, 2012లో ‘హీరో’, ‘సిమ్’, 2014లో ‘డాల్ఫిన్ బార్’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. దిఫన్ చేతన్ తెరకెక్కిస్తున్న ‘సత్య’ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.

More Telugu News