: గౌతమ్ గంభీర్ వివాదంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీ

టీమిండియా ఆటగాడు, ఢిల్లీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వివాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీసీ) నియమించింది. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా గంభీర్ కు, కోచ్ కృష్ణన్ భాస్కరన్ పిళ్లైల మధ్య వివాదం చోటు చేసుకుంది. ట్రోఫీలో ఢిల్లీ పోరాటం ముగిసిన తర్వాత గంభీర్ తనను తీవ్ర పదజాలంతో దూషించాడంటూ భాస్కరన్ మీడియా ముందు పలుసార్లు వాపోయాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీడీసీఏ... ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వం వహించనున్నాడు. ఆయనతో పాటు ఈ కమిటీలో రాజేందర్ ఎస్ రాథోడ్, సోనీ సింగ్ లు ఉన్నారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ ఓ సర్య్కులర్ జారీ చేశారు.

More Telugu News