: ఈ రోజు ఉదయం భూమాకు ఫిట్స్ వచ్చాయి: డాక్టరు హరినాథ్

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమాకు వైద్య చికిత్స అందించిన డాక్టరు హరినాథ్ మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం భూమాకు ఫిట్స్ వచ్చాయని, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారని అన్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వచ్చారని చెప్పారు. అయితే, తీవ్ర గుండెనొప్పి కూడా రావడంతో ఆయన పల్స్ రేట్ పడిపోయిందని, సుమారు రెండు గంటల పాటు తాము ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. కాగా, 1999లో భూమా నాగిరెడ్డికి బైపాస్ సర్జరీ చేశారని, ఏడాదిన్నర క్రితం గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియో గ్రామ్ పరీక్ష చేశామన్నారు. షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ తో పాటు తీవ్ర మానసిక ఒత్తిడీ ఆయనకు గుండెనొప్పి రావడానికి కారణమని అన్నారు. 

More Telugu News