: పోలీస్ కేస్ పెట్టిన పూరీ జగన్నాధ్ కొత్త సినిమా హీరోయిన్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కొత్త హీరోయిన్ తనను వేధిస్తున్న యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూరీ జగన్నాథ్ తాజా సినిమా 'రోగ్'లో ఒక హీరోయిన్ గా నటించిన మోడల్, నటి ఏంజెలా క్రిస్లిన్జ్కీ ని చాలా కాలంగా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఏడిపిస్తున్నాడు. దీంతో, రాహుల్ ఖన్నా ఫేక్ ప్రొఫైల్ తో ఉన్న వ్యక్తి తనను కొన్ని రోజులుగా మానసికంగా వేధిస్తున్నాడని ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి ఐపీ అడ్రెస్ ట్రేస్ చెయ్యమని పోలీసులను కోరింది. కాగా, ఆమె 'జ్యోతి లక్ష్మీ', 'సైజ్ జీరో' సినిమాల్లో నటించింది. 

More Telugu News