: భూమా మృతితో ఏపీ బడ్జెట్ వాయిదా!

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణ ఈ రోజు మధ్యాహ్నం ఓ ప్రకటనను విడుదల చేశారు. భూమా మృతికి సంతాప సూచకంగా రేపు అసెంబ్లీ, శాసనమండలికి సెలవు ప్రకటించామన్నారు. భూమా మృతిపై మంగళవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ఉంటుందని, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీపై బీఏసీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News