: భూమా ఆరోగ్యంపై కామినేని, అఖిల ప్రియలకు ఫోన్ చేసిన చంద్రబాబు

నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుకు గురికావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు గురయ్యారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ను ఆదేశించిన చంద్రబాబునాయుడు, వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భూమా నాగిరెడ్డికి సురక్షా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇంకా మెరుగైన వైద్యం అవసరమైన పక్షంలో ఆయను హెలికాప్టర్ లో హైదరాబాదుకు తరలిస్తామని ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం చంద్రబాబునాయుడు భూమా అఖిల ప్రియకు ఫోన్ చేసి ఆమె తండ్రి ఆరోగ్యపరిస్థితిపై ఆరాతీశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. భూమా ఆరోగ్యంపై మరికాసేపట్లో వైద్యులు బులెటిన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News