: ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్రతిపక్ష బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి త‌మ రాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంప‌రింగ్ చేశార‌ని, త‌మ‌కు వేసిన ఓట్ల‌న్నీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి వెళ్లాయ‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఆమె ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ లాంటివి ఏమీ జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌క‌ట‌న చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు స‌జావుగా ఎటువంటి పొర‌పాట్లు లేకుండా జ‌రిగాయ‌ని తెలిపింది. మాయావతి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేల్చి చెప్పింది.

More Telugu News