: రాజీనామా చేసిన యూపీ, గోవా ముఖ్యమంత్రులు

రాష్ట్రంలో త‌మ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంతో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న గవర్నర్ రామ్ ‌నాయక్‌కు రాజీనామా లేఖ‌ను అందజేశారు. ఈ రాజీనామాపై స్పందించిన గ‌వ‌ర్న‌ర్ తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆయనను పదవిలో కొనసాగాలని కోరారు. మ‌రోవైపు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా త‌న పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్రెమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న కాంగ్రెస్‌ అభ్యర్థి దయానంద్‌ రఘునాథ్‌ సోప్టే చేతిలో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకున్నారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

More Telugu News