: యూపీలో ‘చాణక్య’ సర్వే నిజమైంది!

యూపీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ మాత్రం రాదనీ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. కానీ యూపీలో బీజేపీ ప్రభంజనం సృష్టించి దాదాపు 285 - 300 వరకు, ఎస్పీ కూటమి 60 - 80, బీఎస్పీ 20-30 స్థానాలు గెలుస్తాయని న్యూస్ 24, టుడేస్ చాణక్య సర్వేలు మాత్రమే కచ్చితమైన అంచనా వేసి చెప్పాయి. ఈ రెండు చానెళ్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలను వెల్లడించాయి. ప్రస్తుతం వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే ఈ రెండు చానెళ్లు చెప్పిన విధంగానే ఫలితాలు వుండడం విశేషం. ప్రస్తుత ఫలితాల్లో బీజేపీ - 320; ఎస్పీ కాంగ్రెస్ కూటమి - 59; బీఎస్పీ-18 సీట్లను; ఇతరులు-6 ఆధిక్యంలో ఉన్నారు.  

More Telugu News