: బెంగళూరులో మరో దారుణం.. బార్ గర్ల్ పై అత్యాచారం

ఐటీ రంగంలో దూసుకుపోతూ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగాంచిన బెంగళూరు నగరం అత్యాచారాలకు నిలయంగా మారి, చెడ్డ పేరును మూటగట్టుకుంటోంది. మహిళలపై అత్యాచారాలు జరగడం బెంగళూరులో సర్వసాధారణమయింది. తాజాగా నగరంలోని రామమూర్తి నగర్ లో ఓ బార్ గర్ల్ పై అత్యాచారం జరిగింది. రెసిడెన్సీ రోడ్ లో ఉన్న ఓ బార్ లో పనిచేస్తున్న యువతికి చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి మత్తు పానీయం ఇచ్చి, ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ ఘటనపై ఆమె రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 5వ తేదీన ఈ అత్యాచారం జరిగింది. పోలీసులు చక్రధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 

More Telugu News