: యూపీని స్వీప్ చేస్తాం.. 300 స్థానాలు మావే: బీజేపీ

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీస్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగా అంచనా వేయలేకపోయాయని... తాము 300 స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం యూపీలో బీజేపీ హవానే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు.

403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 202 స్థానాలు అవసరం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్... సీట్లను గెలుచుకునే విషయంలో మాత్రం బీజేపీకి 200 స్థానాల వరకు కట్టబెట్టాయి.  

More Telugu News