: యూపీలో వెల్లడైన తొలి ట్రెండ్స్... బీజేపీకి ఆధిక్యం

దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభం కాగా, తొలి ఫలితాల సరళికి సంబంధించిన ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎనిమిది చోట్ల బీజేపీ, మూడు చోట్ల సమాజ్ వాదీ, ఒక స్థానంలో బీఎస్పీ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పంజాబ్ లో రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఆమ్ ఆద్మీ, ఉత్తరాఖండ్ లో రెండు చోట్ల బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. గోవా, మణిపూర్ ఫలితాల ట్రెండ్స్ వెలువడాల్సి వుంది.

More Telugu News