: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని నేను ఎప్పుడూ నమ్మను: లాలూ ప్రసాద్ యాదవ్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తాను ఎప్పుడూ నమ్మనని, ప్రతిసారి, ఆ ఫలితాలు అసత్యమని తేలాయని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి నిన్న ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై లాలూ మీడియాతో మాట్లాడుతూ, యూపీలో కాంగ్రెస్ - ఎస్పీ కూటమి విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొన్నానని, ప్రజల నాడి తనకు తెలుసని, ప్రభుత్వాన్ని ఏర్పరిచేది కాంగ్రెస్-ఎస్పీ కూటమేనని అన్నారు.

అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ బీజేపీకి వత్తాసుగా వచ్చాయని, ఈ విషయం బీజేపీ నేతలందరికీ తెలుసని అన్నారు. 2015 బీహార్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయని, కానీ, ఆర్జేడీ - జనతాదళ్ - కాంగ్రెస్ పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు.

More Telugu News