: మరింత దిగజారిన బంగారం ధర

బంగారం ధరలు మ‌ళ్లీ కింది చూపులు చూస్తున్నాయి. నిన్న 10 గ్రాముల పసిడి ధర రూ.29,250 గా న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ రోజు మ‌రింత దిగ‌జారిన ప‌సిడి ధ‌ర‌ మ‌రో రూ.400 త‌గ్గి పది గ్రాములకు రూ.28,850గా న‌మోదైంది. మ‌రోవైపు వెండి ధ‌ర‌లు కూడా నేల చూపులే చూశాయి. ఈ రోజు కిలో వెండి ధ‌ర‌ రూ.525 తగ్గి రూ.40,975కు చేరుకుంది. మార్కెట్‌లో డిమాండ్ త‌గ్గ‌డం వ‌ల్లే ప‌సిడి, వెండి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Telugu News