: కౌంటింగ్ కు ముందే అఖిలేష్ ఓటమిని అంగీకరించారు: కిరణ్ రిజిజు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగకముందే ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఓటమిని అంగీకరించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. యూపీలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే బహుజన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలను ఇవ్వడం ద్వారా అఖిలేష్ తన ఓటమిని అంగీకరించాడని చెప్పారు. నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలైన వెంటనే అఖిలేష్ స్పందిస్తూ, రాష్ట్రంలో మతతత్వ బీజేపీని అడ్డుకునేందుకు సెక్యులర్ శక్తులన్నీ ఏకం కావాలని అన్నారు. ఫలితాల అనంతరం పొత్తులను తోసిపుచ్చలేమని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూనే, కిరణ్ రిజిజు పైవిధంగా స్పందించారు.

More Telugu News