: నిరసనలతో అట్టుడుకుతున్న దక్షిణ కొరియా

దక్షిణ కొరియా నిరసనలతో అట్టుడుకుతోంది. దేశాధ్యక్షురాలు పార్క్ గెన్ హేను ఆఫీసు నుంచి తొలగిస్తున్నట్టు ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో, ఆమె అభిమానులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, పలుచోట్ల పోలీసులకు, పార్క్ గెన్ హే అభిమానులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె అభిమానులు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. శాంసంగ్ సంస్థ హెడ్ తో కలిసి భారీ అవినీతికి పార్క్ గెన్ పాల్పడినట్టు కోర్టులో నిరూపితమైంది. దీంతో, ఆమెను ఆఫీస్ నుంచి తొలగిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 

More Telugu News