: సొంత పొలంలో పండించిన 'ఆలూతో లాలూ'... వైరల్ అవుతున్న పిక్ ఇది!

తన ధోరణితో ఎన్నో మార్లు హాస్యం పండించిన రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తన సొంత పొలంలో ఆలూ (బంగాళాదుంప) పంటను పండించిన ఆయన, ఓ పెద్ద ఆలూను పట్టుకుని ఫోటో దిగి, దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేయడంతో అదిప్పుడు వైరల్ అయింది. ఈ సంవత్సరం మంచి పంట చేతికి వచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించిన ఆయన, దిగుబడి తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. 'ఆలూతో లాలూ' చిత్రాన్ని మీరూ చూడవచ్చు.


More Telugu News