: మృగ్యమైన అనుబంధాలు...పెళ్లి చేయాల్సి వస్తుందని చెల్లెల్ని హతమార్చాడు!

ఆధునిక కాలంలో బంధాలు, అనుబంధాలు మృగ్యమైపోతున్నాయి. ఢిల్లీలో తాజాగా చోటుచేసుకున్న ఘటన మనుషుల మధ్య బంధాలు ఎలా మారిపోయాయో తెలియజేస్తుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీలోని హస్నాపూర్ లోని మధువిహార్ లో నివాసముండే కుటుంబ పెద్ద 2008లో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు. వారి ద్వారా ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ బాలికకు ఇప్పుడు 19 ఏళ్లు. దీంతో ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత సవతి సోదరుడైన తపాస్ బర్మన్ పై పడింది.

సవతి చెల్లెలి బాధ్యత తలకెత్తుకోవాల్సిన తపస్, ఆమెకు వివాహం చేయడం కంటే ఆమె ప్రాణాలు తీయడమే మేలని భావించాడు. దీంతో ఆమె గొంతుకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో మధువిహార్ లోని ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికెళ్లి చూడగా, బాలిక మృతదేహం పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టంకు పంపారు. అనంతరం తపస్ బర్మన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా, పెళ్లి చేయాల్సి వస్తుందని చెల్లెలిని హతమార్చినట్టు తెలిపాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. 

More Telugu News