: పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ దారుణ హత్య!

పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ దారుణ హత్యకు గురైంది. బలుచిస్థాన్ ప్రావిన్స్ లోని నసీరాబాద్ జిల్లాకు చెందిన జనియా కుమారి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో ఆమెను దారుణంగా నరికి పరారయ్యారు. ఈ సంఘటనపై జనియా కుమారి సోదరుడు జలోరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే తన సోదరిని హతమార్చి ఉంటారని జలోరామ్ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల నుంచి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీసులకు విన్నవించారు. అయితే, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

More Telugu News