: ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదుచూస్తున్నా: పూరీ జగన్నాధ్

తాను నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా తీయాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశానని, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని దర్శకుడు పూరీ జగన్నాధ్ వ్యాఖ్యానించాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణను ఎన్నటికీ మరచి పోలేనని అన్నాడు. ఎప్పటి నుంచో ఆయనతో వర్క్ చేయాలని తనకుందని చెప్పాడు. "నేను మీ అభిమానులందరికీ మాటిస్తున్నాను. మీకు ఏం కావాలంటే, ఎలా కావాలంటే... ఆ రేంజ్ లో వుంటుంది. సో... ఆయన డైలాగులు కానీ, ఆయన లుక్ గానీ... జై బాలయ్య. సినిమా వెంటనే ప్రారంభమవుతుంది, సెప్టెంబర్ 29న రిలీజ్... కావాలంటే ఒకరోజు ముందే అయినా రిలీజ్ కు రెడీ. థ్యాంక్యూ, థ్యాంక్యూ సోమచ్" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News