: అక్కడ ఏది కొన్నా పదిరూపాయలే... సామాన్యుల క్యూ!

ఆ షాపులో ఏ వస్తువు కొనుగోలు చేసినా కేవలం 10 రూపాయలకే లభిస్తుంది. నిరుపేదలందరికీ తక్కువ ధరలో అన్ని వస్తువులను అందించాలనే లక్ష్యంతో 'ఏక్ నూర్' అనే స్వచ్ఛంధ సంస్థ ఈ షాపును పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో ఏర్పాటు చేసింది. కేవలం 10 రూపాయలకే ఈ షాపులో దుస్తుల నుంచి బూట్లు, బొమ్మలు, నిత్యావసరాలు, ఇంటి అలంకరణకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఈ షాపులో వస్తువులు కొనడానికి క్యూ కడుతుంటారు. 2014లో ప్రారంభమైన ఏక్ నూర్ స్వచ్ఛంధ సంస్థ ఇప్పటివరకు 250 మంది శస్త్రచికిత్సలకు సాయం చేసింది. కులమత భేదాలు లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని సంస్థ సభ్యులు తెలిపారు.

More Telugu News