: తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిందని వాపోతున్న టాలీవుడ్ నటి మడోన్నా సెబాస్టియన్

నాగచైతన్యతో 'ప్రేమమ్' సినిమాలో నటించిన మడోన్నా సెబాస్టియన్ తన ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ అయిందని పేర్కొంది. దీంతో తాను మళ్లీ ప్రకటించేవరకు తన ఫేస్ బుక్ పేజ్ నుంచి వచ్చే పోస్టులు లేదా ఫోటోలను పట్టించుకోవద్దని అభిమానులకు సూచించింది. ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే అయినా తప్పదని పేర్కొంది. దీంతో సినీ నటుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేయడంపై మరోసారి సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. 

More Telugu News