: ఇలాంటి పిచ్ లుంటే అంతే మరి!: పెదవి విరిచిన సౌరవ్ గంగూలీ

భారత్, ఆస్ట్రేలియాల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కోసం తయారు చేసిన బెంగళూరు పిచ్ పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పెదవి విరిచాడు. ఈ తరహా పిచ్ లపై తొలుత టాస్ గెలిచిన వారే విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డ ఆయన, అదే నిజమైందని, పుణెలో తయారు చేసినటువంటి పిచ్ నే ఇక్కడా తయారు చేశారని అన్నాడు. కాగా, పుణెలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేసి, ఆపై భారత బ్యాటింగ్ లైనప్ ను కకావికలు చేసి, విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇక నిన్న ముగిసిన మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు, తొలుత బ్యాటింగ్ తీసుకుని ఆస్ట్రేలియాను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయం భారత జట్టుకు ప్రత్యేకమైనదని అభివర్ణిస్తూనే, ఈ తరహా పిచ్ లపై టాస్ ఓడితే, మ్యాచ్ ఓడినట్టేనని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో గంగూలీ వ్యాఖ్యానించాడు. కాగా, నాలుగు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 1-1 తేడాతో సమంగా ఉండగా, మూడవ టెస్టు, రాంచీలో 16 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

More Telugu News