: వికారాబాద్ జిల్లా మదనపల్లెలో ఇద్దరు బాలికలపై అత్యాచారం

వికారాబాద్ జిల్లాలో అత్యాచారపర్వం వెలుగు చూసింది. వికారాబాద్ జిల్లా మదనపల్లెలో ఇద్దరు బాలికలను ఆటోలో కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు. అయితే జరిగిన దారుణంతో భయాందోళనలకు గురైన బాధిత బాలికలిద్దరూ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పో్లీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. 

More Telugu News