: రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
బెంగళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఇచ్చిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. వార్నర్ 17 పరుగులు చేసి వెనుదిరగగా, రెన్షా 5 పరుగులకే ఔటయ్యాడు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో స్మిత్ 20, మార్ష్ 7 పరుగులతో ఉన్నారు. టీమిండియాను ఓడించాలంటే ఆస్ట్రేలియా మరో 129 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో చేతిలో మరో 8 వికెట్లు ఉండడంతో ఆ లక్ష్యం చిన్నదే.