: కోహ్లీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నాడు, అందుకే ఎల్బీడబ్ల్యూ గ్రహించలేకపోయాడు!: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మార్క్ వా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ ఆటగాడు మార్క్ వా అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి ఏకాగ్రత కుదరడం లేదని మార్క్ వా తెలిపాడు. దీని ప్రభావం భారత జట్టులోని ఇతర సభ్యులపై పడుతోందని సూచించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌ లో కోహ్లీ 12 పరుగులకే ఔట్‌ అయిన సంగతిని గుర్తు చేసిన మార్క్ వా... ప్రపంచస్థాయి ఆటగాడైన కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా ఔటయినట్టు గ్రహించకపోవడం విడ్డూరంగా ఉందన్నాడు. కోహ్లీ పాజిటివ్ గా ఆలోచిస్తే సానుకూల ఫలితాలు సాధించవచ్చని సలహా ఇచ్చాడు. 

More Telugu News