: మాపై ఆరోపణలు చేసి నోరు మూయించాలని జగన్ చూస్తున్నాడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్

మాపై ఆరోపణలు చేసి నోరు మూయించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ చూస్తున్నాడని గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని, రాష్ట్ర విచ్ఛిన్నానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం, రాజధాని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే జగన్ లక్ష్యం అని, ప్రజా సమస్యలపై పయ్యావుల కేశవ్, తాను మాట్లాడుతూనే ఉంటామని అన్నారు. తన ఆస్తుల అటాచ్ మెంట్ పై జగన్ ఎందుకు మాట్లాడరని ఈ సందర్భంగా నరేంద్ర ప్రశ్నించారు.

More Telugu News