: రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ కొనసాగించాలని సిఫారసు చేసిన ప్రివిలేజ్ కమిటీ

ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ సినీ నటి, చిత్తూరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. దీనిపై రోజా ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో రోజాపై మరో ఏడాది నిషేధం కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసింది. ఇప్పటికే ఏడాది అసెంబ్లీ నిషేధాన్ని ఆమె ఎదుర్కొన్న విషయం విదితమే!  

More Telugu News