: కేసీఆర్ ఆలోచన వెనుక పెద్ద కుట్ర దాగుంది: వీహెచ్

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని... మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుంటే, కులాల మధ్య టీఆర్ఎస్ చిచ్చు రాజేస్తోందని విమర్శించారు. బీసీలకు పెద్ద పీట వేయాలనే ముఖ్యమంత్రి ఆలోచన వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. బీసీ విద్యార్థులకు గొర్రెలు, పందులు ఇవ్వడం కాదు... మంచి విద్యను అందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందని, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. ఈ సమాచారం కేసీఆర్ కు చేరడం వల్లే...పలు పథకాలను ప్రటిస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News