: వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం: యరపతినేని

2019 లో జరగబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోను విజయ దుందుభి మోగించి, ఆ గెలుపును సీఎం చంద్రబాబుకు కానుకగా ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు ఆత్మగౌరవ యాత్ర విజయవంతం చేశామని, నేడు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నారని, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.

More Telugu News