: 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్ పై కేసు నమోదు

ఈటీవీలో ప్రసారమవుతున్న 'జబర్దస్త్' కామెడీ షోలో పాల్గొంటున్న కమెడియన్ ముక్కు అవినాష్ పై పోలీస్ కేసు నమోదైంది. శివరాత్రి పండుగ రోజున ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడంటూ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అవినాష్ పై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రోగ్రామ్ కోసం రూ. 10 వేలు కూడా అడ్వాన్స్ గా తీసుకున్నాడని... ప్రోగ్రామ్ కు మాత్రం రాలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు అవినాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News