: జయలలిత ఆత్మ నాతో మాట్లాడి పలు విషయాలు చెప్పింది: శ్రీ మహారిషి సాధువు ప్రకటనతో కలకలం
తిరువరూరుకి చెందిన శ్రీ మహారిషి అనే ఓ సాధువు ఈ రోజు పన్నీర్సెల్వం ఇంటికి వెళ్లి అలజడి రేపాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ తనతో మాట్లాడి పలు విషయాలు చెప్పిందని ఆయన అక్కడ మీడియాకు తెలిపాడు. తనను ఆసుపత్రిలో 75 రోజుల పాటు ఉంచారని జయలలిత ఆత్మ చెప్పిందని ఆయన అన్నాడు. అంతేకాకుండా పన్నీర్సెల్వం, దీప కలిసి ఏఐఏడీఎంకేను రక్షించాలని చెప్పమని జయలలిత ఆత్మ తనని ఆదేశించిందని ఆయన చెప్పారు. అమ్మ పన్నీర్ సెల్వానికే మద్దతు తెలిపారని ఆ సాధువు చెప్పారు. దీంతో పన్నీర్సెల్వం ఇంటి ముందు కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.