: ఈసీ నోటీసులకు సమాధానం పంపిన అన్నాడీఎంకే... శశికళ నియామకం చెల్లుతుందని 72 పేజీల వివరణ

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం నిబంధనల మేరకే జరిగిందని ఆ పార్టీ 72 పేజీల సుదీర్ఘ వివరణ పత్రాన్ని ఎలక్షన్ కమిషన్ కు పంపింది. ఏ నిబంధనల ప్రకారం శశికళ నియామకం జరిగిందని ఈసీ ప్రశ్నించిన నేపథ్యంలో పార్టీ సమాధానం ఇచ్చింది. ఈ వివరణలో పార్టీ జనరల్ కౌన్సిల్ కు ఎవరినైనా తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించే అధికారం ఉందని స్పష్టం చేసింది. అందుకు తమ పార్టీ మాన్యువల్ సహకరిస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఆమెనే కార్యదర్శిగా కొనసాగిస్తామని, ఆమె నియామకం ఏకగ్రీవంగా సాగిందని వెల్లడించింది.

More Telugu News