: సీట్లు లేవని విమానంలో ప్రయాణికులను నిలబెట్టి తీసుకెళ్లిన ఘటనలో పైలట్కు నోటీసులు
విమానంలో సీట్లులేవంటూ ప్రయాణికులను నిలబెట్టి తీసుకెళ్లిన ఘటన పాకిస్థానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థ విమానంలో జరిగిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియాకు వెళ్లే విమానంలో ఏడుగురు ప్రయాణికులను అలా విమానంలో సీటు లేకుండా నిలబెట్టి ప్రయాణించేలా చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఆ విమాన పైలట్కు, మరో ఇద్దరు అధికారులకు పాకిస్థాన్ ఎయిర్లైన్స్ షోకాజ్ నోటీసులు పంపించారు. ఈ విమానం కరాచీ నుంచి మదీనా ప్రయాణించింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో కెప్టెన్ అన్వర్ ఆదిల్, సీనియర్ ఎయిర్హోస్టెస్ హీనా తురబ్, టెర్మినల్ మేనేజర్ అక్బర్ అలీ షాలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు.