: కొత్త పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత మేనకోడలు దీపా
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా ఆమె మేనకోడలు దీపా జయకుమార్ మూడు రోజుల క్రితం కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాజకీయ పార్టీకి 'ఎంజీఆర్ అమ్మ దీప పెరవై' అని పేరు పెట్టారు. ఈ క్రమంలో, ఈ రోజు దీప ఆ పార్టీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మొదట పార్టీకి ఫోరం ట్రెజరర్గా ఉంటానని చెప్పి, రాజాను సెక్రటరీగా నియమించారు. మరోవైపు నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకున్న ఆమె మద్దతుదారులు రాజాను సెక్రటరీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంతో వారికి అనుకూలంగా వ్యవహరించిన దీపా సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. ఇక నుంచి ఎంజీఆర్ అమ్మ దీపా పెరవైకి తానే కార్యదర్శిగా ఉంటానని చెప్పారు. కాగా, మిగతా ఆఫీస్ బేరర్లను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు.