: హీరో ధనుష్‌పై ఆ ట్వీట్లు చేసింది సుచిత్ర కాదట.. వివరణ ఇచ్చిన కార్తీక్

తమిళ ప్రముఖ హీరో ధనుష్‌పై గాయని సుచిత్రాకార్తీక్ ఇటీవల చేసినట్టుగా చెబుతున్న ట్వీట్లు దుమారం రేపడంతో ఆమె భర్త కార్తీక్ రంగంలోకి దిగారు. ఆ ట్వీట్లు సుచిత్ర చేసినవి కావంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో వివరణ ఇచ్చారు. సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఆ సమయంలోనే ట్వీట్లు పోస్టయ్యాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇన్ని రోజులుగా పబ్లిష్ అవుతున్న ట్వీట్లు సుచి చేసినవి కావు. సుచి అకౌంట్ హ్యాక్ అవడంతో మేం చాలా కలత చెందాం. ఈ రోజు సుచి అకౌంట్‌ను రిట్రైవ్ చేశాం’’ అని కార్తీక్ పేర్కొన్నారు.

ఇటువంటి సందర్భాల్లో అవతలి వ్యక్తులు ఎంతటి ఒత్తిడికి గురై ఉంటారో తాను అర్థం చేసుకోగలనని, వారందరినీ క్షమాపణ వేడుకుంటున్నట్టు చెప్పారు. ఇటువంటి విషయాల్లో మీడియా కూడా సంయమనం పాటించాలని కోరారు. అయితే భర్త కార్తీక్ వివరణను సుచిత్ర ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. కాగా ధనుష్‌, ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కొన్ని రోజులుగా సుచిత్ర సంచలన ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News