: సినీ నిర్మాత పరుచూరి కిరీటిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు!
'సింహా' సినీ నిర్మాత పరుచూరి కిరీటిపై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్ కు చెందిన సినీ నిర్మాత పరుచూరి కిరీటి ఫార్చ్యూనర్ కారులో నిబంధనలకు విరుద్ధంగా వేగంగా వెళ్తూ హల్ చల్ చేశారు. ఇలా గత నాలుగు రోజులుగా ఆ రోడ్డులో ఒకే సమయంలో కారు అతి వేగంగా వెళ్తుండడంతో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో ఉన్న ఓ హోం గార్డు గమనించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు, ఆ కారు ఎవరిదని ఆరాతీసి మాటు వేశారు. నిన్న కూడా అదే రోడ్ లో మాదాపూర్ వైపు నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా దూసుకురావడంతో అడ్డుకున్న పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు.