: ఫిబ్రవరి 24... సచిన్ కు ఎంతో ప్రత్యేకమైన రోజు ఇది!

ఫిబ్రవర్ 24వ తేదీ... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఈ రోజు అత్యంత కీలకమైనది. సరిగ్గా ఏడేళ్ల క్రితం... అంటే 2010 ఫిబ్రవరి 24న వన్డే క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ నమోదయింది. గ్వాలియర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో చరిత్రలోనే తొలి వన్డే డబుల్ సెంచరీని సచిన్ టెండూల్కర్ సాధించాడు. ఆ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు. దీంతో, భారత్ మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించగా... సచిన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. డబుల్ సెంచరీని చేసిన సచిన్... ఆ రాత్రి నిద్ర లేకుండానే గడిపాడట. సంతోషంతో సచిన్ కు నిద్ర పట్టలేదట. ఫోన్ లో మెసేజ్ బాక్స్ మొత్తం అభినందనలతో నిండిపోయిందని... వాటిని, చదువుతూ, రిప్లై ఇస్తూ గడిపానని తన ఆత్మకథ 'ఫ్లయింగ్ ఇట్ మై వే'లో తెలిపాడు. 

More Telugu News