: 'రాహుల్ ఇంకా పిల్లవాడే' అంటూ షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇంకా చిన్నపిల్లాడే అని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ కు 46 ఏళ్లు వచ్చినప్పటికీ... ఆయనలో ఇంకా పూర్తి పరిపక్వత రాలేదని చెప్పారు. పరిపక్వత వచ్చేందుకు ఆయనకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు. అయితే, రాహుల్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని... ప్రధాని మోదీలా లేని విషయాన్ని సృష్టించుకుని మాట్లాడరని అన్నారు. రైతుల గురించి మాట్లాడింది రాహుల్ మాత్రమేనని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని షీలా దీక్షిత్ తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న నాయకత్వ మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రియాంకగాంధీ గొప్ప మేధావి అని... ఆమె వల్లే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరిందని అన్నారు. రాహుల్, ప్రియాంకలు కలసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పారు. 

More Telugu News