: హీరోలు శింబు, ధనుష్ లపై తీవ్ర ఆరోపణలు చేసిన సింగర్ సుచిత్ర

తమిళ యువ హీరోలు శింబు, ధనుష్ లపై గాయని సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ వైపు హీరోయిన్లు భావన, వరలక్ష్మీ శరత్ కుమార్ ల ఉదంతాలు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంటే... తాజాగా సుచిత్ర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. శింబు, ధనుష్ లు తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారంటూ సుచిత్ర ట్వీట్ చేశారు.

అయితే, ఇది నిజం కాదని, సుచిత్ర ట్విట్టర్ హ్యాక్ చేసి, ఎవరో ఈ పోస్ట్ చేశారనే ప్రచారం జరిగింది. అయితే, అంతలోనే, వెంటనే తన సెల్ఫీ ఫొటోను సుచిత్ర పోస్ట్ చేసి... తాను ట్విట్లర్లోకి మళ్లీ వచ్చానని చెప్పింది. ధనుష్ ప్రవర్తన గురించి అందరికీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. ఇది ముమ్మాటికీ నిజమని చెప్పింది. 'శింబు.. నువ్వు కూడా ఈ లిస్ట్ లో ఉన్నావు' అని తెలిపింది. ధనుష్ టీమ్ రఫ్ హ్యాండ్లింగ్ వల్ల గాయపడ్డ తన చేతి ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

More Telugu News