: బీజేపీ కార్పొరేటర్ ను వరించిన అదృష్టలక్ష్మి

బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేటర్ ను అదృష్టలక్ష్మి వరించింది. 220వ డివిజన్‌ లో బీజేపీ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి అతుల్‌ షా పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా శివసేన సిట్టింగ్ కార్పొరేటర్ సురేంద్ర భాగల్కర్ పోటీ చేశారు. వీరిద్దరికీ సమానంగా ఓట్లు పడ్డాయి. దీంతో మరోసారి కౌంటింగ్ చేశారు. రీకౌంటింగ్ లో కూడా ఓట్లు సమానంగా వచ్చాయి. దీంతో మున్సిపల్ కమిషనర్ సమక్షంలో లాటరీ నిర్వహించగా, ఆ లాటరీలో విజయం బీజేపీ అభ్యర్థి అతుల్ షాను వరించింది. తనకు దక్కిన అదృష్టానికి అతుల్ షా పరమానందభరితుడయ్యాడు. 

More Telugu News