: పాకిస్థాన్ నుంచి వచ్చి పడుతున్న న‌కిలీ నోట్లు!

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నెలల ముందు తీసుకొచ్చిన రూ.500, 2000 నోట్ల‌కు కూడా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ   ఐఎస్ఐ న‌కిలీ నోట్ల‌ను ముద్రిస్తూ చలామ‌ణిలోకి తీసుకొస్తున్న‌ట్లు మన ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు గుర్తించాయి. పాక్‌లో త‌యార‌యిన ఈ నోట్ల‌ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు తీసుకొస్తున్న‌ట్లు గుర్తించారు. దావూద్ ఇబ్ర‌హీం అనుచ‌రుల అధీనంలో ఈ న‌కీలీ నోట్ల దందా కొన‌సాగుతున్న‌ట్లు తేలింది. న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్ట‌డానికి అనేక క‌ట్టుదిట్ట‌మైన ఫీచ‌ర్ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త నోట్ల‌ను తీసుకొచ్చినప్ప‌టికీ వాటికి కూడా న‌కిలీ నోట్ల‌ను ముద్రిస్తూ ఐఎస్ఐ క‌ల‌క‌లం రేపుతోంది.  

More Telugu News