: ఐటెం సాంగ్ చేసిన అనసూయకు మొత్తం డబ్బులు ఇంకా ఇవ్వలేదట!

బుల్లి తెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినీ రంగ ప్రవేశం చేసింది అనసూయ. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'క్షణం' వంటి సినిమాల్లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం 'విన్నర్' లో ఐటెం గాళ్ గా మారి, 'సూయ.. సూయ' అనే పాటకు చిందులేసింది. అయితే, ఈ పాటకు సంబంధించిన పూర్తి డబ్బులు అనసూయకు ఇంకా అందలేదట.

వాస్తవానికి ఈ పాట కోసం రూ. 14 లక్షలను అనసూయకు ఆఫర్ చేశారట. అడ్వాన్స్ గా రూ. 10 లక్షలు చెల్లించారట. అయితే, అనుకున్న సమయానికి పాట షూటింగ్ పూర్తి కాకపోవడంతో... మరో మూడు రోజులు అదనంగా పని చేయాల్సి వచ్చిందట. దీనికి గాను, అదనంగా మరో రూ. 6 లక్షలు ఇస్తామని దర్శకనిర్మాతలు హామీ ఇచ్చారట. అంటే అనసూయకు ఇంకా రూ. 10 లక్షలు రావాలన్నమాట. కానీ, చిత్ర నిర్మాత కాని, దర్శకుడు కాని ఈ డబ్బు ఊసే ఎత్తడం లేదట. సినిమా ప్రమోషన్లకు, ప్రీరిలీజ్ ఈవెంట్లకు తాను హాజరవుతున్నా... వారు మాత్రం తనకు రావాల్సిన సొమ్ముపై మాట్లాడకపోవడంతో అనసూయ చాలా బాధపడుతోందట.

More Telugu News