: నాడు రాజులు, చక్రవర్తులు .. నేడు కేసీఆర్!: టీటీడీ ఈవో సాంబశివరావు ప్రశంసలు

గతంలో రాజులు, చక్రవర్తుల వంటి వారు ఖరీదైన కానుకలను శ్రీ వేంకటేశ్వరుడికి సమర్పించారని, నేడు కేసీఆర్ ఆవిధంగా చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో సాంబశివరావు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తానని నాడు మొక్కుకున్న కేసీఆర్, ఆ మొక్కును ఈ రోజు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు మాట్లాడుతూ, అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజ్ వంటి వారు మాత్రమే ఎంతో ఖరీదైన కానుకలను తిరుమల శ్రీవారికి సమర్పించారన్నారు. మళ్లీ, అటువంటి ఖరీదైన కానుకలను కేసీఆర్ మాత్రమే సమర్పించారని, ఆయన కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. 

More Telugu News