: మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టుంది రోజా తీరు.. నాలుక కోసే రోజు వస్తుంది జాగ్రత్త!: హెచ్చరించిన ప్రతిభావంతుల చైర్మన్
వైసీపీ నేత రోజా తీరు చూస్తుంటే మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని ఏపీ ప్రతిభావంతుల కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల)పై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న రోజా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆమె నాలుక కోయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడకుండా టీడీపీ నేతలను విమర్శించడంతోనే ఆమె కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఆమె హావభావాలు చూసి మహిళా లోకం సిగ్గుపడుతోందన్నారు. ఆమెకేదైనా సమస్య ఉంటే తన కుటుంబ సభ్యులనో, కూతురునో, భర్తనో ఉదాహరణగా పేర్కొనాలి కానీ విభిన్న ప్రతిభావంతుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు. భాషను మార్చుకోకుంటే ఆమె నాలుకను విభిన్న ప్రతిభావంతులు కోసి పారేస్తారని హెచ్చరించారు.