: హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న బస్సు బోల్తా..30 మందికి గాయాలు!

హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చీలాపూర్ గేటు సమీపంలో బోల్తా కొట్టింది. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చీలాపూర్ గేటు సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News