: అత్తాపూర్ లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!

ఎయిర్ కూలర్ గోడౌన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం అయిన విషాద సంఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని అత్తాపూర్ లో జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఏవీ 1 ఎయిర్ కూలర్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ దారుణం జరిగింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News