: తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్ దంపతులు

తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు మరి కొంచెం సేపట్లో దర్శించుకోనున్నారు. మహాద్వారం ద్వారా కేసీఆర్ ఆలయ ప్రవేశం చేయనుండగా, మంత్రులు, అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను శ్రీ వేంకటేశ్వరుడికి కేసీఆర్ అందజేయనున్నారు. కాగా, తిరుమలలోని శ్రీ కృష్ణ అతిథి గృహంలో కేసీఆర్ కుటుంబం నిన్న రాత్రి బస చేసింది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తమకు కేటాయించిన అతిథి గృహాల్లో బస చేశారు.

More Telugu News